బైకు అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

by Kavitha |   ( Updated:2024-10-09 02:33:41.0  )
బైకు అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు
X

దిశ బిజినాపల్లి: బైకు అదుపుతప్పి తీవ్ర గాయాలైన సంఘటన పాలెం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా బిజినాపల్లి మండలం వడ్డేమాన్ గ్రామానికి చెందిన రామకృష్ణ బిజినాపల్లి నుంచి పాలెం వస్తుండగా మార్గ మధ్యలో బైకు అదుపు తప్పి వాకింగ్‌కి వెళ్తున్న వారికి ఢీకొట్టింది. దీంతో రామకృష్ణ కింద పడ్డాడు. అలా కింద పడ్డ అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే వాకింగ్‌ చేస్తున్న వ్యక్తులు స్వల్ప గాయాలతోనే బయటపడగా వారు.. తీవ్ర గాయాలైన రామకృష్ణను 108 సహాయంతో నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed