- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టీయూలో చదువుతో క్రీడలకు సమ ప్రాధాన్యత

దిశ ప్రతినిధి, నిజామాబాద్ మార్చి 24: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చదువుతో పాటు క్రీడలకు కూడా సమ ప్రాధాన్యతను ఇస్తోందని తెలంగాణ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ యూనివర్సిటీలో యాన్యువల్ డే 2025 స్పోర్ట్స్ మీట్ లో భాగంగా సోమవారం ఐదో రోజు జరిగిన బాలుర కబడ్డీ పోటీలను రిజిస్ట్రార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆచార్య ఎం. యాదగిరి మాట్లాడుతూ..
ప్రభుత్వం ఈసారి క్రీడలకు ప్రత్యేకమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. విద్యార్థినీ, విద్యార్థులు తమ నైపుణ్యాలు, కౌశలాలు పాఠశాల విద్యలో మొదలు కుని కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో గుణాత్మకంగా మారుతాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యతో పాటు, క్రీడలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి క్రీడాకారులను పరిచయం చేసుకొని, టాస్ వేసి పోటీలను ప్రారంభించారు.
ఎవరు గెలుపొందారు..
మొదటి పోరులో ఎం.ఎస్సీ కెమిస్ట్రీ జట్టు అప్లైడ్ ఎకనామిక్స్ జట్టుతో తలపడగా ఉత్కంఠ పోరు నడుమ 26 పాయింట్స్ తో అప్లైడ్ ఎకనామిక్స్, ఎం.ఎస్సీ కెమిస్ట్రీ జట్టుపై గెలుపొందింది. రెండవ పోరులో అప్లైడ్ ఎకనామిక్స్ విద్యార్థుల జట్టు, మాస్ కమ్యూనికేషన్ విద్యార్థుల జట్టుపై 29 పాయింట్ల తేడాతో విజయం సాధించిందని వర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ జి. బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ డైరెక్టర్,పి ఆర్ ఓ డాక్టర్ పున్నయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బీ. ఆర్ నేత, నరేష్, కబడ్డీ అఫీషియల్స్ తో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు.