విద్యార్థుల అవస్థలు పట్టవా..?

by Sumithra |
విద్యార్థుల అవస్థలు పట్టవా..?
X

దిశ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బాలుర ప్రత్యేక వసతి గృహం చుట్టూ గ్రామపంచాయతీ అధికారులు విచ్చలవిడిగా ఇచ్చిన అనుమతులతో అనేక దుకాణ సముదాయాలు ఏర్పడుతున్నాయి. దీంతో వసతి గృహంలో వెంటిలేషన్ రాకుండా కిటికీలకు అడ్డంగా దుకాణ సముదాయాలు ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు సమస్యలు ఏర్పడుతున్నాయి.

చిన్నచిన్న క్రిమి కీటకాలు సైతం హాస్టల్లో దూరుతున్న సంఘటనలు అనేకం కనబడుతున్నాయి. విద్యార్థులు రోగాల బారిన పడుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నప్పటికీ అధికారులు సైతం వాటిని పెడచెవిన పెడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వసతి గృహాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన దుకాణ సముదాయాలను తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, మండల ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed