నిజామాబాద్ బీఆర్ఎస్‌కు షాక్.. తిరిగి బీజేపీలో చేరిన కార్పోరేటర్లు

by Mahesh |
నిజామాబాద్ బీఆర్ఎస్‌కు షాక్.. తిరిగి బీజేపీలో చేరిన కార్పోరేటర్లు
X

దిశ, వెబ్‌డెస్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ప్రభుత్వం కోల్పోవడంతో పలు మున్సిపాలిటీలకు చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండగా.. మరికొందరు తాము మొదట గెలిచిన పార్టీలోకి తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన కార్పోరేటర్లు ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం నిజామాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ధన్‌పాల్ సూర్య నారాయణ భారీ మెజారిటీతో బీజేపీ నుంచి గెలిచాడు. దీంతో పార్టీ మారిన నలుగురు కార్పోరేటర్లు తిరిగి బీజేపీ పార్టీలో చేరారు. కార్పొరేటర్లకు ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో అర్బన్ లో బీఆర్ఎస్ పార్టీ పై భారీ ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Next Story