డబ్బులు వేసుకోవడానికి మీకేం కష్టం..

by Sumithra |
డబ్బులు వేసుకోవడానికి మీకేం కష్టం..
X

దిశ, భిక్కనూరు : ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేయడానికి వస్తే, గంటల తరబడి నిల్చోబెట్టి ఇబ్బందులకు గురి చేస్తారా అంటూ ఖాతాదారు బ్యాంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగిన సంఘటన సోమవారం భిక్కనూరు ఎస్బీఐ బ్యాంకులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల కేంద్రానికి చెందిన చాకలి మ్యాతరి జానకి తన ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేయడానికి సదరు బ్యాంకుకి వెళ్లింది. అక్కడ సిబ్బంది దగ్గరికి వెళ్లి కొంత డబ్బును తన ఖాతాలో వేసుకోవాలని సదరు బ్యాంకు సిబ్బందిని కోరింది. బ్యాంకు సిబ్బంది ఏవేవో కారణాలు చెబుతూ అరగంట పాటు కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్లీ సిబ్బంది వద్దకు వెళ్లి డబ్బులు జమ చేసుకోవాలని కోరగా పాన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని వస్తే జమ చేసుకుంటామని అప్పటి వరకు జమ చేసుకోలేమని తేల్చి చెప్పారు.

దీంతో ఆగ్రహించిన ఖాతాదారు జానకితో పాటు బ్యాంకులోని ఖాతాదారులు ప్రతిసారి ఈ బ్యాంకులో ఇదే సమస్యను లేవనెత్తుతూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఊరుకోకుండా తెలుగు భాష రాణి సిబ్బందిని అపాయింట్ చేయడం వలన వారికి మన భాష, వారి భాష మనకు అర్థం కాక అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని మండిపడ్డారు. ఖాతాదారులు మూకుమ్మడిగా లొల్లి పెట్టడంతో లక్షా 90 వేల రూపాయలు ఖాతాదారు అకౌంట్ లో జమ చేసుకున్నారు. ఈ మేరకు ఎస్బీఐ సిబ్బంది పై బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని కొంతమంది ఖాతాదారులు నిర్ణయించుకున్నారు.

Advertisement

Next Story