- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రూ. 520 తో రూ. 10 లక్షల ప్రమాద బీమా
దిశ, తాడ్వాయి : టాటా ఏఐజీతో తపాలా శాఖ కస్టమర్ల కోసం ప్రమాదబీమా ఫాలసీని తీసుకొచ్చిందని పోస్టల్ అధికారి జనార్దన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని తపాలా శాఖ ఆధ్వర్యంలో అందించే సేవలపై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించరు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. జీవిత బీమా, ఆరోగ్య బీమా తరహాలోనే ప్రమాద బీమా తీసుకునే వారి సంఖ్య పెరుగుతుందని అన్నారు. టాటా ఏఐజీతో కలిసి తమ కస్టమర్లకు ఈ ఫాలసీ ద్వారా రూ. 520 తో రూ.10లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు.
అంతే కాకుండా సోలార్ పవర్ వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రధాని మోదీ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పథకంలో ప్రతి నెలా కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ను అందించనున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని అట్టడుగు స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి పట్టణ, స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ అధికార పరిధిలో రూఫ్టాప్ సోలార్ సిస్టమ్లను వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎం సురేష్, నర్సారెడ్డి, రాజేశ్వరరావు, శ్రీనివాస్, రాజశేఖర్, చంద్రశేఖర్, విట్టల్, రచన, మధుసూదన్, పోస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.