విద్యుదాఘాతంతో ఒకరి మృతి

by Sridhar Babu |
విద్యుదాఘాతంతో ఒకరి మృతి
X

దిశ, బాల్కొండ : మండల కేంద్రమైన మెండోరా లో విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి గౌడ మల్లేష్ (25) మృతి చెందాడు. ఎసై శ్రీనివాస్ యాదవ్ తెలిపిన ప్రకారం మల్లేష్ మెదక్ జిల్లా నర్సాకేడ్ గ్రామం నుండి వచ్చి ఏడు సమత్సరాలుగా గొర్రెలను కాస్తూ జీవనం సాగిస్తున్నాడన్నారు. శనివారం గొర్రెల కోసం చెట్ల ఆకులు కోసేందుకు చెట్టు పైకి ఎక్కడంతో పైన ఉన్న విద్యుత్ వైర్లు తాకి షాక్​ కొట్టడంతో మృతి చెందినట్టు ఎసై తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రి కి శవాన్ని తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎసై తెలిపారు.

Advertisement

Next Story