పెన్షన్లు తీసివేసే అధికారం ఎవ్వరికీ లేదు

by Sridhar Babu |
పెన్షన్లు తీసివేసే అధికారం ఎవ్వరికీ లేదు
X

దిశ, ఆర్మూర్ : పెన్షన్లను తీసివేసే అధికారం ఎవ్వరికీ లేదని, ఏ పార్టీ నాయకుల బెదిరింపులకు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని బాల్కొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్ పల్లి మండలం కోనాపూర్ తదితర గ్రామాల్లో అన్నపూర్ణమ్మ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కారు గుర్తుకు ఓటు వెయ్యకపోతే పెన్షన్లు తీసివేస్తామని మహిళలను భయాందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్లు తీసేస్తామని ఎవరైనా చెప్తే వారిని చెప్పులతో తరిమికొట్టాలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, అతని సోదరుడు నియోజకవర్గంలోని యువతను గంజాయికి బానిసలుగా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుందన్నారు. బాల్కొండలో బీజేపీని గెలిపిస్తే అర్హులందరికీ ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కట్ట సంజీవ్, బీజేవైఎం అధ్యక్షులు నిరంజన్, భాస్కర్, అంజయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story