- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పార్టీ మారడంతో మున్సిపల్ చైర్మన్కు పదవి గండం
దిశ, ఎల్లారెడ్డి: మున్సిపల్ చైర్మన్ పదవి బాధ్యతల నుంచి తప్పించాలని ఎల్లారెడ్డి మున్సిపల్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణపై పది మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్కు అందజేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ పార్టీ మారడంపై పది మంది కౌన్సిలర్లు ఆయనపై అవిశ్వాస తీర్మానం అందజేశారు. ఎల్లారెడ్డి మున్సిపల్ లో 12 వార్డుల్లో గాను పదిమంది వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చైర్మన్ పదవి నుంచి తొలగించే విధంగా పది మంది కౌన్సిలర్లు వైస్ చైర్మన్ సుజాతమ్మతో పాటు జిల్లా కలెక్టర్కు అవిశ్వాస పత్రం అందజేశారు.
మున్సిపల్ పట్టణంలోని 12 వార్డుల్లో, 2 వార్డు సభ్యులు,మంచిర్యాల మహేశ్వరి, విద్యాసాగర్లు ఒక్కరూ మాత్రమే, అవిశ్వాస తీర్మానంలో పాల్గొనలేరని, కౌన్సిలర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో, ఎల్లారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ సుజాతమ్మ, ఎల్లారెడ్డి మున్సిపల్ పలు వార్డులోని కౌన్సిలర్లు, అల్లం శీను భూమిగారి రాము, ఎరుకల సాయిలు, నీలకంఠం, పద్మ శ్రీకాంత్, గాదె విజయలక్ష్మి, సంఘని బాలమని, నునుగొండ భూదేవి,పర్విన సుల్తానా, కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కలెక్టర్కు అందజేశారు.