మాక్లూర్ ఎంపీటీసీ -2 కిడ్నాప్ ?

by Sumithra |
మాక్లూర్ ఎంపీటీసీ -2 కిడ్నాప్ ?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో మాక్లూర్ ఎంపీటీసీ -2 కిడ్నాప్ కు గురైందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ పార్టి ఎంపీపీ మస్త ప్రభాకర్ పై సభ్యులు అసమ్మతితో అవిశ్వాసం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అర్మూర్ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఓడిపోవడంతో మండలంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాక్లూర్ మండల కేంద్రానికి చెందిన ఎంపీటీసీ-2 మీరాబాయి ఈనెల 10న కిడ్నాప్ కు గురైందని మీరాబాయి కుటుంబ సభ్యులు పలువురు పై అనుమానం వ్యక్తం చేస్తూ మాక్లూర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ గురై ఆరు రోజులైనా మీరాబాయి ఆచూకీ దొరకకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు, శుక్రవారం నగరంలోని సీపీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్బంగా మీరాబాయి భర్త నారాయణ మాట్లాడుతూ ఈ నెల 10న ఎంపీపీ మరికొందరు తన నివాసానికి వచ్చి త‌న‌ భార్య మీరాబాయిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఈ విషయమై మాక్లూర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోయారు. సాయంత్రం వరకు ఎంపీటీసీ 2 మీరాబాయిని తీసుకురాకపోతే కుటుంబమంతా ఆత్మహత్యాయత్నానికి పాల్పడతామని హెచ్చరించారు. త‌న‌ భార్య ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ అధికారులు వెంటనే స్పందించి కిడ్నాప్ పై విచారణ చేపట్టి వారి చెర నుంచి ఎంపీటీసీ 2 మీరాబాయిని తీసుకురావాలని కోరారు. ఎంపీటీసీ మీరాబాయిని వదిలిపెట్టకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని ఎంపీటీసీల పోరం జిల్లా అధ్యక్షులు కోటగిరి లక్ష్మీ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఓ ప్రజాప్రతినిధిని ఇలా కిడ్నాప్ చేయడం సరికాదు అన్నారు. వెంటనే బాధ్యులైన ఎంపీపీ ప్రభాకర్, రంజిత్, వైస్ ఎంపీపీ భర్త సుక్కి సుధాకర్, డ్రైవర్ బక్క శ్రీనుల పై కిడ్నాప్ కేసుతోపాటు, అట్రాసిటీ కేసునమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story