అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎంపీ అరవింద్

by Kalyani |
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎంపీ అరవింద్
X

దిశ, నందిపేట్ : నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామంలో అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ పరిశీలించారు. ప్రభుత్వం రైతులకు కనీస సౌకర్యాలు సమకూర్చలేని ఆవేదన వ్యక్తం చేశారు.అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వర్షాలకు దెబ్బతిన్న పంటకు నష్టపరిహారం ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అరవింద్, బిజెపి కన్వీనర్, మంగారపు నవీన్, భూతం సాయి రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed