ఆసుపత్రికి వెళ్లిన తల్లి కూతురు అదృశ్యం

by Naresh |
ఆసుపత్రికి వెళ్లిన తల్లి కూతురు అదృశ్యం
X

దిశ, కామారెడ్డి : కూతురుకు ఆసుపత్రిలో చూపించి వస్తానని చెప్పి వెళ్లిన తల్లి కూతుళ్లు ఇద్దరు అదృశ్యమైన సంఘటన కామారెడ్డి శివారులోని రామేశ్వర్ పల్లిలో చోటుచేసుకుంది. దేవునిపల్లి ఎస్సై రాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన అర్థ శ్యామల (26) అనే మహిళ శుక్రవారం మధ్యాహ్నం తన చిన్న కూతురు వేదశ్రీ (2) అనే పాపకు జ్వరం రాగా ఆసుపత్రిలో చూపించుకోని వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళినట్లు భర్త అర్ధ నరసింహులు తెలిపారు. సాయంత్రం వరకు కూడా ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికినట్లు పేర్కొన్నారు. ఇక్కడ ఆచూకీ కనిపించకపోవడంతో భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆచూకీ లభించిన వారు తమను సంప్రదించాలని ఎస్సై రాజు కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు.

Advertisement

Next Story