- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దు కోసం మోదీ ప్రయత్నం
దిశ, కామారెడ్డి : రాజ్యాంగాన్ని రద్దుచేసి రిజర్వేషన్లను తొలగించడానికే మోడీ 400 సీట్లు అడుగుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆయనపై ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శనివారం సాయంత్రం కామారెడ్డిలో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ తో కలిసి రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4 వేల కిలోమీటర్లు దళిత, గిరిజనులు, బలహీన వర్గాలకు రాజ్యాంగాన్ని రక్షించడం కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారన్నారు.
ఈడీ, సీబీఐ, ఐటీ, ఢిల్లీ పోలీస్, అంబానీ, ఆధాని మోడీ పరివార్ అని, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు రాహుల్ గాంధీ పరివార్ అని అన్నారు. ఈ ఎన్నికలు మోడీ పరివార్ రాహుల్ పరివార్ మధ్య జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా సభికులతో లక్షా పక్కా అంటూ చప్పట్లు కొట్టిస్తూ ఉర్రూతలూగించారు. సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపదాస్ మున్షీ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్కార్ తదితరులు పాల్గొన్నారు.