- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హిందూ వ్యతిరేకి
దిశ, ఆర్మూర్ : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హిందూ వ్యతిరేకి అని నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శనివారం ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లి లో గల నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ కార్యాలయంలో ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. సీఏఏకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో గతంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పూర్తిగా ముస్లింలకు వత్తాసు పలికారని అన్నారు. కేవలం ఇప్పుడు ఎన్నికల కారణంగా మౌనం వహిస్తున్నారని, మళ్లీ ఎన్నికలు కాగానే ముస్లింల పక్షాన ఉంటారని అన్నారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి, విధానాలను భరించలేక జగిత్యాల జిల్లాకు చెందిన జెడ్పీటీసీ తమ సిద్ధాంతాలు నచ్చి, నరేంద్ర మోడీ నాయకత్వం మీద విశ్వాసంతో
బీజేపీలో చేరడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇకనైనా ఇటువంటి నీచ రాజకీయాలు మానుకోవాలని హితువు పలికారు. ఓట్ల కోసం హిందువుల మనోభావాలు దెబ్బతీయడం సరికాదన్నారు. హిందూ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి రామ్ రామ్ చెప్పి మైనార్టీల మెప్పు కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మత రాజకీయాలను నిరసిస్తూ పలువురు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో జెడ్పీటీసీ పద్మా రమేష్,పాత రమేష్, మాజీ సొసైటీ చైర్మన్ లు చేరగా వీరికి ఎంపీ కాషాయ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పటేల్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బాల్కొండ ఇన్చార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, బీజేపీ నిజామాబాద్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.