- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
గెటవుట్ అంటూ దురుసుగా మాట్లాడిన ఎమ్మెల్యే పైడి
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మెప్మా ఆర్పీలను వాలంటీర్లుగా ఎన్నికల్లో వినియోగించుకున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎన్నికల్లో బూత్లను సందర్శిస్తూ డ్యూటీలో ఉన్న మహిళ ఉద్యోగి అయిన దుండి గంగామణి మెప్మా ఆర్పీతో దురుసుగా మాట్లాడి ఇక్కడి నుండి బయటికి వెళ్లు గెటవుట్ అంటూ పోలింగ్ బూత్ నుండి బయటకు పంపించి వేశారు. దాంతో మెప్మా ఆర్పీ ఏం చెప్పినా వినిపించుకోకుండా ఎమ్మెల్యే పైడి ఆమెపై దురుసుగా మాట్లాడినట్లు వివరించింది. అక్కడి నుండి ఏడుస్తూ వెళ్లి మాకు మున్సిపల్ కమిషనర్ డ్యూటీ వేశారు అని ఎంత చెప్పినా వినకుండా మీ ఆర్పీ లకు ఇక్కడ ఏం పని ఎందుకు వచ్చారు అని ఆమెను అందరి ముందు ఎమ్మెల్యే అవమానంగా మాట్లాడాడు.
ఎమ్మెల్యే మాటలకు మనస్థాపానికి గురైన మహిళా ఉద్యోగి తాను చేస్తున్న ఆర్పీ ఉద్యోగానికి బుధవారం రాజీనామా చేసి మున్సిపల్ కమిషనర్ రాజుకు ఆమె రాజీనామా పత్రాన్ని అందజేసింది. ఎవరి భర్త అయినా రాజకీయాల్లో ఉంటే వారి భార్య జాబ్ చేయకూడదా ? రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల భార్యలు జాబులు చేయడం? లేదా అని ఆమె ప్రశ్నించింది. భర్త రాజకీయాల్లో ఉంటే వారి భార్యను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇలాగే అవమానిస్తారా అని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం కోసం ధర్మం కోసం పనిచేస్తానని చెప్పిన రాకేష్ రెడ్డి ఆడవారితో మాత్రం ఎలా మాట్లాడాలో తెలియదా అని ఆమె పేర్కొంది. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి అందరిని సమానంగా చూడాలని, ఇలా కించపరిచేలా ప్రవర్తించ కూడదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. ఏది ఏమైనా తన రాజీనామాకు మాత్రం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కారణం అని, 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న మెప్మా ఆర్పీ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు దొండి గంగామణి చెప్పారు.