మెడికల్ కళాశాలకు మహర్దశ...

by Sumithra |
మెడికల్ కళాశాలకు మహర్దశ...
X

దిశ, నిజామాబాద్ సిటీ : మన ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్ లో రేడియాలజి విభాగంలో ఐదు యం.డి. పిజీ సీట్లను గురువారం జాతీయ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసిందన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. ఇందిరా రేడియాలజి విభాగం వైద్యులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు రేడియాలజి విభాగంలో మరింత సేవలు అందనున్నాయని అన్నారు. అన్ని విధాలుగా సహకరిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. నాగమోహన్, జీజీఎచ్ సూపర్ ఇండెంట్ ప్రతిమా రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story