నీట మునిగి వ్యక్తి మృతి

by Sridhar Babu |
నీట మునిగి వ్యక్తి మృతి
X

దిశ, జుక్కల్ : నీట మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని లాడే గావ్ గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లాడే గావ్ గ్రామానికి చెందిన ప్రసాద్ (43) కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. శనివారం తన భార్య దేవి, కుమారుడుతో కలిసి కూలి పనికి వెళ్లి తిరిగి తన ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో ఊర చెరువు దగ్గరకు రాగానే కాలకృత్యాలు తీర్చుకుంటానని ప్రసాద్ వెళ్లి కాలు జారి అందులో పడి మృతి చెందాడు. దాంతో భార్య పోలీసులకు సమాచారం అందించడంతో ఆదివారం ఫైర్ సిబ్బంది , గ్రామస్తుల సహాయంతో మృతుని శవాన్ని చెరువులో నుండి బయటకు తీశారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story