ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి..

by Sumithra |
ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి..
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆర్మూర్లో పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆర్మూర్ నియోజకవర్గ నాకు ఓటువేసిన అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు. అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన బీజేపీ పైడి రాకేష్ రెడ్డికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నైతికంగా మనమే గెలిచామని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది, కావున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అధైర్య పడవద్దు అని, నియోజకవర్గ ప్రజలకు దగ్గరుండి పనిచేయాల్సిన బాధ్యత మనదేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, నియోజకవర్గంలోని ప్రతిఅభివృద్ధి పనులకు నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉండి ఎల్లవేళలా మీకు ముందుండి నడిపిస్తానని, అభిమానులు ప్రజలు అధైర్యపడవద్దని నేను మీకు మాటిస్తున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎల్లవేళలా నన్నుసంప్రదించవచ్చు అని అన్నారు.

Next Story

Most Viewed