సూర్యనారాయణ గెలుపు పట్ల న్యాయవాదుల సంబరాలు

by Sumithra |
సూర్యనారాయణ గెలుపు పట్ల న్యాయవాదుల సంబరాలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గా ధనపాల్ సూర్యనారాయణ గుప్తా గెలుపొందం పట్ల న్యాయవాదులు సంబరాలు జరుపుకున్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కోర్టు ఎదుట టపాకాయల పేల్చి, మిఠాయిలు స్వీట్లు పంచిపెట్టకొని ఘనంగా విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిజేపి లీగల్ సెల్ న్యాయవాది పి వెంకటేశ్వర్ మాట్లడుతూ ఈ గెలుపు ప్రజా విజయం కొనియాడారు. ఇదే స్ఫూర్తితో నగర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్యక్రమంలో బీజేపీ లీగల్ సెల్ న్యాయవాదులు జగన్మోహన్ గౌడ్ , బండారి కృష్ణనండ్, బిట్ట్ల రవి ,వసంత్ రావు, విఘ్నేష్, మధుసూదన్ గౌడ్, జగదీశ్వరరావు, విక్రమ్, జేపీ లోహియా, వెంకట్రమణ గౌడ్, పిల్లి శ్రీకాంత్, మెదరి శేఖర్, కేశవ్రావు, సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Next Story

Most Viewed