ఇదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలి.. మాజీ ఎంపీ

by Sumithra |
ఇదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలి.. మాజీ ఎంపీ
X

దిశ, కామారెడ్డి : ఎంపీ ఎన్నికల్లో మోడీకి మద్దతుగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసిన వారికి ధన్యవాదాలు అని, ఇదే స్ఫూర్తితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో గెలవాలని మాజీ ఎంపీ బీబీ పాటిల్ కోరారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశంలో భాగంగా కామారెడ్డి జిల్లా కార్యాలయంలో ఆదివారం కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కృషితో కామారెడ్డిలో బీజేపీకి అత్యధికంగా ఓట్లు వచ్చాయని, కానీ మిగితా చోట్ల ప్రజల్ని ఆకట్టుకోలేక పోయామన్నారు. నిస్వార్థంగా పని చేసి కామారెడ్డిలో 19 వేల మెజారిటీ తెచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

జహీరాబాద్ పార్లమెంటు ప్రభారి పెద్దోళ్ల గంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయని, జహీరాబాద్ పార్లమెంట్ కూడా గెలుపు అంచుల్లో ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారం సాధించే దిశగా బీజేపీ అడుగులు వేస్తుందని, అందుకు కార్యకర్తలు ఇప్పటి నుండే సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, పార్లమెంట్ కో కన్వీనర్ కాసర్ల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు ఆకుల భరత్, కౌన్సిలర్ నరేందర్, నాయకులు సంధ్య, వేణు, బాల్ రాజు, అనిత, నెహల్, మండల అధ్యక్షులు సురేష్, అనిల్, రమేష్, భూపాల్, రంజిత్ గౌడ్, శ్రీనివాస్, సరోజలతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed