- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
అవినీతి చేయను.. అవినీతికి పాల్పడిన వారిని వదిలి పెట్టను
దిశ, ఆర్మూర్: ఆర్మూర్ ఎమ్మెల్యేగా నా పదవీ కాలంలో అవినీతి చేయను అని, అవినీతి చేసిన వాళ్లను వదిలిపెట్టను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలం రామచంద్ర పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ భవనంను ఆదివారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే అని, పచ్చని పల్లెలో రాజకీయ బేధాలు లేకుండా అందరూ కలిసి పల్లెలను, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఇటీవల మొదటిసారి ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వత మీ గ్రామానికి రావడం జరిగిందన్నారు.ప్రతి గ్రామంలో విద్య, వైద్య,ఉపాధికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు పైడి రాకేష్ రెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రభాకర్,సర్పంచ్ వెంకన్న,మహేష్,సురేష్, బిజెపి నాయకులు,కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.