మాజీ సీఎం వైఎస్సార్ ను హత్య చేసింది ఎవరో నాకు తెలుసు : ఎంపీ

by Sridhar Babu |
మాజీ సీఎం వైఎస్సార్ ను హత్య చేసింది ఎవరో నాకు తెలుసు : ఎంపీ
X

దిశ, నిజామాబాద్ సిటీ : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని హత్య చేయించింది ఎవరో తనకు తెలుసని, తన గురించి మాట్లాడితే ఆ చిట్టా విప్పుతానని ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. ఆయనను హత్య చేసింది ఎవరో పేర్లతో సహా బయట పెడతానని తెలిపారు.

ఎంపీ అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్ నగర శివారులో బుధవారం జరిగిన బీజేపీ రూరల్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ అరవింద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తిగతంగా తమపై తమ నేతలపై ఆరోపణలు చేస్తున్నారని, తన జోలికి వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతల బాగోతం బయట పెడతానని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్లపాటు తెలంగాణను దోచుకుంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు నెలల్లో రాష్ట్రాన్ని అధోగతిపాటు చేస్తున్నారని, అభివృద్ధి చేయకుండా బీజేపీ నాయకులను, ప్రధాని మోడీని విమర్శిస్తూ వ్యక్తిగతంగా దిగజారడం సరైన పద్ధతి కాదన్నారు.

Advertisement

Next Story