భార్యను చంపి భర్త బలవన్మరణం

by Sridhar Babu |
భార్యను చంపి భర్త బలవన్మరణం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. భార్యను హత్య చేసిన భర్త తర్వాత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం వెలుగు చూసింది. నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిల్లా కెనాల్ కట్ట ప్రాంతంలోని ఆటో డ్రైవర్ స్వామి (45) , లక్ష్మీ (40) దంపతులు తమ కుమారుడు మల్లికార్జున్ తో కలిసి నివసిస్తున్నారు. కుమారుడు మల్లికార్జున్ డిచ్పల్లి మండలం బీబీపూర్ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

బుధవారం ఇంటర్ పరీక్షలకు కుమారుడు వెళ్లిన తర్వాత తండ్రి స్వామి తన భార్య లక్ష్మిని హత్య చేసి తాను ఉరి వేసుకున్నాడు. గత కొంతకాలంగా డిప్రెషన్లో ఉన్నామని అందుకే చనిపోతున్నట్టు వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టిన తర్వాత ఈ ఘాతుకం చేసుకున్నారు. ఇంటర్ పరీక్ష ముగించుకొని ఇంటికి వచ్చిన మల్లికార్జున్ తల్లిదండ్రులు ఇద్దరూ విగత జీవులై ఉండటంతో బోరున విలపించాడు. సంఘటన స్థలాన్ని నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ సతీష్, పోలీస్ అధికారులు సందర్శించి వివరాలు సేకరించారు. ఐదవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed