మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

by Sridhar Babu |
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్ లో స్థానిక కార్పొరేటర్, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ హరుణ్ ఖాన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ వేడుకల్లో రాష్ట్ర మంత్రి సీతక్క మాట్లాడుతూ... పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైన నేపథ్యంలో నిజామాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్టార్‌ విందులో పాల్గొన్న ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు.

మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సలహాదారు మహమ్మద్ షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ....ముస్లింల రిజర్వేషన్స్ తొలగించడం మోదీ తరం కాదు అన్నారు. తమ ప్రభుత్వం ముస్లింలకు అమలు చేస్తోన్న నాలుగు శాతం రిజర్వేషన్‌ను తొలగిస్తానంటూ హైదరాబాద్ పర్యటన సందర్భంగా అమిత్ షా చెప్పారని, అది ఆయన వల్ల కాదని అన్నారు. ముస్లింల రిజర్వేషన్‌ను తొలగించడం ప్రధాని మోదీ వల్ల గానీ, అమిత్ షా వల్ల గానీ కాదని స్పష్టం చేశారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానంలో పోరాడామని దాన్ని కాపాడే బాధ్యత కూడా తమదేనని అన్నారు. తమది సెక్యులర్ ప్రభుత్వమని, అందరినీ కలుపుకొని వెళ్తుందని వ్యాఖ్యానించారు.

మతం పేరుతో విడగొట్టబోమని చెప్పారు. హిందువులు, ముస్లింలు తనకు రెండు కళ్లలాంటి వారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లోనూ తెలంగాణలో పురోగమించేలా, దేశంలోనే అగ్రరాజ్యంగా ఆవిర్భవించాలని కోరుతూ పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని ఆయన ముస్లిం సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్బిన్ హాందాన్ కేశ వేణు, నరాల రత్నాకర్. స్థానిక కార్పొరేటర్ హారున్ ఖాన్ ,ఖుద్దుస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story