రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు త్వరితగతంగా పూర్తి చేయించండి: ఎంపీ ధర్మపురి అరవింద్

by Mahesh |
రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు త్వరితగతంగా పూర్తి చేయించండి: ఎంపీ ధర్మపురి అరవింద్
X

దిశ, ఆర్మూర్: రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని రైల్వే అధికారులకు ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులతో కలిసి పరిశీలించారు. అదే విధంగా బిల్లుల చెల్లింపుల విషయంలో సైతం కాంట్రాక్టర్‌కు సహకరించాలని అధికారులకు ఎంపీ సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల నిధులు మళ్లించడం జరిగిందని, ఇప్పటికైనా నూతన ప్రభుత్వం రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు తరగతిన పూర్తి అయ్యే విధంగా చూడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, రైల్వే అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, బీజేపీ నాయకులు పుప్పాల శివరాజ్ కుమార్ ,కంచెట్టి గంగాధర్, ద్యాగ ఉదయ్ కుమార్, ఆకుల శ్రీనివాస్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, కాందేశ్ ప్రశాంత్, పోల్కం వేణు, తదితరులు ఉన్నారు. అంతకుముందు మాకూరు మండలంలోని అడవి మామిడిపల్లి రైల్వే బ్రిడ్జి పనులను ఎంపీ అరవింద్ అధికారులతో బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. అడవి మామిడిపల్లి రైల్వే బ్రిడ్జి పనులకు విడుదలైన నిధులు దారి మళ్లించారని ఎంపీ అరవింద్ మండిపడ్డారు.

Next Story