షార్ట్ సర్క్యూట్ తో రైస్ మిల్లులో అగ్నిప్రమాదం

by Sridhar Babu |
షార్ట్ సర్క్యూట్ తో రైస్ మిల్లులో అగ్నిప్రమాదం
X

దిశ, భిక్కనూరు : ప్యానెల్ బోర్డు లో షార్ట్ సర్క్యూట్ సమస్య తలెత్తి రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించి సుమారు 50 లక్షల రూపాయల నష్టం వాటిల్లిన సంఘటన సోమవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... మండల కేంద్రం శివారులోని సప్తగిరి రైస్ మిల్లులో సాయంత్రం అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఆఫీస్ క్యాబిన్ తో సహా 50 వేల సంచుల బార్ధాన్, 114 సంచుల బాయిల్డ్ రైస్, ప్యానెల్ బోర్డు తో సహా అగ్నికి ఆహుతయ్యాయి.

అంతేకాకుండా మిల్లులో నడిచే మోటార్లు కూడా కాలిపోయాయి. చెలరేగుతున్న మంటలను అదుపు చేసేందుకు రైస్ మిల్లు సిబ్బంది బకెట్లలో తెచ్చి నీళ్లు చల్లినప్పటికీ ఎగిసిపడుతున్న మాటలు అదుపులోకి రాలేదు. దీంతో కామారెడ్డి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా, వెంటనే ఫైర్ ఇంజన్ ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేసింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. ఈ మేరకు మిల్లు యజమానులు భిక్కనూరు పోలీస్ స్టేషన్ కు చేరుకొని కంప్లైంట్ చేయగా ఎస్ఐ సాయి కుమార్ ఆధ్వర్యంలోని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed