- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రైతులకు వెంటనే పరిహారం అందజేయాలి
by Sridhar Babu |
X
దిశ, కామారెడ్డి : కామారెడ్డి మండలంలో శనివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న, వరి, కూరగాయల పంటలను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదివారం పరిశీలించారు. మండలంలోని తిమ్మకపల్లి, చిన్న మల్లారెడ్డి, కొట్టాలపల్లి, నరసన్నపల్లి గ్రామాల్లో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పడగళ్ల వర్షానికి 90 శాతానికి పైగా పంటకు దెబ్బతిన్నాయని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వెంటనే ప్రభుత్వం బాధిత రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని సూచించారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story