తహసీల్దార్​ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

by Sridhar Babu |
తహసీల్దార్​ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
X

దిశ, మాచారెడ్డి : తండ్రి పేరిట ఉన్న వారసత్వ వ్యవసాయ భూమి పట్టాను తన పేరిట బదలాయింపు చేయకపోవడంతో మనస్థాపానికి గురై ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

మండలంలోని ఉప్పల్ వాయి గ్రామానికి చెందిన మంత్రి భగవాన్ ఈ చర్య కు పాల్పడ్డాడు. తన వారసత్వ భూమి తన తండ్రి మంత్రి మొగులయ్య పేరుపైన ఉన్న సర్వే నంబర్ 856/68 లోని ఎకరం భూమిని తన పేరుపైన పట్టా చేయడం లేదని, రామారెడ్డి తహసీల్దార్, అధికారుల నిర్లక్ష్యం వల్ల మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడి గట్టాడు. స్థానికులు అతన్ని రక్షించారు .

Advertisement

Next Story

Most Viewed