ఈనెల 18 నుండి కాకతీయ కాలువకు ఎస్సారెస్పీ నీరు

by Sridhar Babu |
ఈనెల 18 నుండి కాకతీయ కాలువకు ఎస్సారెస్పీ నీరు
X

దిశ, భీంగల్ : పోచంపాడ్ ప్రాజెక్ట్ పరిధిలోని కాకతీయ కాలువ కింద ఉన్న సాగు యాసంగి పంటకు ఈ నెల 18 నుండి సాగునీరు విడుదల చేస్తున్నట్లు ఎస్సారెస్పీ ఎస్ఈ జి. శ్రీనివాస్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సాగునీరు ఆన్ ఆఫ్ పద్ధతిన మొదట ఏడు రోజులు డిస్టిబ్యూటరీ 53 ( జోన్.1) పరిధి సాగు పంటలకు, తర్వాత ఎనిమిది రోజుల పాటు డిస్టిబ్యూటరీ డి. 53 (జోన్.2)పరిధిలోని సాగు పంటలకు నీరు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రాజెక్ట్ లో ప్రస్తుతం ఉన్న నీటి సామర్థ్యం గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నందున రైతులు వృథా చేయకుండా పంటలకు వినియోగించుకోవాలని ఎస్ఈ కోరారు.

Advertisement

Next Story