మాజీ స్పీకర్ పోచారంకు ఏనుగు రవీందర్ రెడ్డి సంచలన సవాల్

by Disha Web Desk 12 |
మాజీ స్పీకర్ పోచారంకు  ఏనుగు రవీందర్ రెడ్డి సంచలన  సవాల్
X

దిశ, కోటగిరి: పచ్చి బట్టలతోనైనా సరే - పసుపు బట్టలతోనైనా సరే తిమ్మాపూర్ వెంకన్న గుడి ఎక్కనికి నేను సిద్ధం మరి మరి పోచారం నువ్వు సిద్ధమా అని కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్కార్‌తో కలసి పోతంగల్ మండల కేంద్రంలోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బిల్లుల అవకతవకలు బయట పెట్టి లబ్ధిదారులు బిల్లులను ఇస్తుంటే కావాలనే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ బిల్లులు రాకుండా నేను మంత్రి కి చెప్పు అడ్డుకుంటున్నాని అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేను డబుల్ బెడ్ రూమ్ బిల్లుల అడ్డుకోలేదని నువ్వు ఇష్టంగా నమ్మే తిమ్మాపూర్ వెంకన్న గుడికి పచ్చి బట్టలతోనైనా సరే - పసుపు బట్టలతోనైనా ఎక్కనికి నేను సిద్ధంగా ఉన్న మరి పోచారం నువ్వు సిద్ధమా అని పోతంగల్ మండల కేంద్రం నుండి సవాల్ విసిరారు. కొడుకులు కుటుంబ సభ్యులు చేసిన అవినీతిని కప్పిపుచ్చడం కోసం లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు. ఎన్నికల సమయంలో దొంగ మాటలు చెబుతూ ప్రజలను హేమర్చేందుకు చూస్తున్న నమ్మే వారు ఎవరు లేరని ఎద్దేవా చేశారు. బాన్సువాడ నుంచి భారీ మెజార్టీతో సురేష్ షెట్కార్ ను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, మాజీ ఎంపీపీ పవన్, గంగాధర్ దేశాయ్, విండో చైర్మన్ డాక్టర్ సునీల్ కుమార్, బీమా సాయి రెడ్డి, శివరాజ్ దేశాయి, ఎంపీటీసీ వీరేషం, బజరంగ్ దత్తు, రాజు,మన్సూర్,తదితరులు పాల్గొన్నారు.

Next Story