జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

by Sridhar Babu |
జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, నాగిరెడ్డిపేట్ : జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం పోచారం గ్రామానికి చెందిన కర్రోళ్ల బాబు (41) అనే వ్యక్తి తన భార్య రాధ ఇద్దరు పిల్లలతో కలిసి మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు.

బాబు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడమే కాక గత రెండు సంవత్సరాల క్రితం తన నివాసపు ఇల్లు కూలిపోవడంతో రేకుల ఇల్లు నిర్మించుకున్నాడు. దీంతోపాటు అప్పులు ఎక్కువ కావడంతో జీవితం పై విరక్తి చెంది తరచూ ఆందోళనకు గురయ్యే వాడని, శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకొని తన రేకుల ఇంట్లో ఇనుపరాడ్డుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాబు భార్య రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story