- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
అభివృద్ధి సంక్షేమాలే బీజేపీని మూడోసారి అధికారంలోకి తీసుకొస్తాయి
దిశ, ఆర్మూర్ : దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే భారతీయ జనతా పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకు వస్తాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లి వెంకటేశ్వర కాలనీలో బీజేపీ పార్లమెంట్ కార్యాలయాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి తో కలిసి బుధవారం ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ నాయకులతో కలిసి మాట్లాడారు.
గత ప్రభుత్వాలు చేయని విధంగా బీజేపీ హయాంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల కోసం చేపట్టడం జరిగిందన్నారు. దేశ ప్రజలంతా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, మూడవసారి భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి. నరసింహ రెడ్డి, ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు ద్యాగ ఉదయ్, బీజేపీ నాయకులు కలిగోట గంగాధర్, ఆకుల రాజు, నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.