ఆర్మూర్ గురుకుల డిగ్రీలో అతిథి అధ్యాపకురాలు మృతి

by Naresh |
ఆర్మూర్ గురుకుల డిగ్రీలో అతిథి అధ్యాపకురాలు మృతి
X

దిశ, ఆర్మూర్‌: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులో అతిథి అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్న సీహెచ్. నిశిత ఆకస్మికంగా మృతి చెందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి. ధనవేని తెలిపారు. కళాశాలలో ఎంతో బాధ్యతగా విధులు నిర్వహించే సీహెచ్ నిషిత కొంతకాలంగా అనారోగ్య సమస్యలకు గురై, చికిత్స అనంతరం మళ్లీ కళాశాలలో చేరి విధులు నిర్వహించింది. కళాశాలలో విధులను బోధన బాధ్యతలను చక్కగా నిర్వర్తించే అధ్యాపకురాలు ఆకస్మికంగా మృతి చెందడం పట్ల తీరని ఆవేదన కలిగించిందని కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు విద్యార్థినిలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కళాశాల అతిథి అధ్యాపకురాలు సీహెచ్ నిషిత మృతికి ప్రిన్సిపాల్ జి. ధనవేని, వైస్ ప్రిన్సిపాల్ ఎన్. శరణ్య, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు సంతాపం ప్రకటించి, ఆమె ఆత్మకు శాంతి కలగాలని తెలిపారు.

Advertisement

Next Story