బస్సు ఢీకొని వ్యక్తి మృతి

by Sridhar Babu |   ( Updated:2023-12-16 15:04:49.0  )
బస్సు ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ సమీపంలో చేపూర్ గ్రామానికి చెందిన రమేష్ సైకిల్ పై వస్తుండగా శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 44వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్మల్ జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సు రమేష్ ను ఢీకొట్టింది. దాంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్ పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story