ఆలూరులో గంజాయి పట్టివేత

by Sridhar Babu |
ఆలూరులో గంజాయి పట్టివేత
X

దిశ, ఆర్మూర్ : స్థానిక ఆలూర్ దేగం రోడ్డుపై ఆర్మూర్ ఎక్సైజ్ బృందం బుధవారం గస్తీ నిర్వహిస్తుండగా పల్లె ప్రకృతి వనం సమీపంలో రాజేష్ ముఖ్య అనే వ్యక్తి గంజాయి ప్యాకెట్స్ అమ్ముతూ పట్టుబడినట్లు ఆర్మూర్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ స్టీవెన్సన్ తెలిపారు. ఓ వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడు అనే సమాచారం మేరకు అక్కడికి వెళ్లగా అనుమానాస్పదంగా

కనిపించిన రాజేష్ ను తనిఖీ చేయగా అతని వద్ద గంజాయి ప్యాకెట్లు లభించాయన్నారు. వెంటనే అతన్ని అరెస్టు చేసి ఎక్సైజ్ స్టేషన్ కు తరలించి అతని వద్ద ఉన్న 220 గ్రాముల గంజాయిని సీజ్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. ఈ తనిఖీలో ఆర్మూర్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్​పెక్టర్ స్టీవెన్సన్, సబ్ ఇన్స్పెక్టర్ లు ఏ. గంగాధర్, ప్రమోద్ చైతన్య, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ గౌడ్, కానిస్టేబుల్స్ దేవిదాస్ , సాయిబాబా గౌడ్, గొల్ల శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Advertisement

Next Story