ఆలూర్ లో పిచ్చికుక్కల స్వైర విహారం

by Sridhar Babu |
ఆలూర్ లో పిచ్చికుక్కల స్వైర విహారం
X

దిశ, ఆలూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూర్ మండల కేంద్రంలో శుక్రవారం పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. ఏడుగురిపై దాడి చేయగా ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని దేగాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విశ్వాస్ కావల్ల, గాడిల మల్లక్క, తొర్తి సావిత్రి, లింగాల రాములు, బూర్గుల మల్లగౌడ్, ఉమ్మెడ నల్లన్న, కత్తుల మోహన్ ను మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులు కుక్కను పట్టుకున్నారు.

Next Story