గంజా, డ్రగ్స్ వ్యాపారం పై ఉక్కుపాదం

by Sumithra |
గంజా, డ్రగ్స్ వ్యాపారం పై ఉక్కుపాదం
X

దిశ, భిక్కనూరు : గంజా, డ్రగ్స్ ను నియంత్రించేందుకు పోలీసు శాఖ ఉక్కుపాదం మోపినట్లు సీఐ తిరుపయ్య అన్నారు. సోమవారం ఆయన భిక్కనూరులో తనను కలసిన విలేకరులతో మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో యూత్ డ్రగ్స్ మత్తులో జోగుతున్నారని, మత్తుమందు ఇటువంటి ఎవరైనా సరే సప్లై చేసేవారి వివరాలు తమకు తెలియజేయాలని, తమకు సమాచారం అందించిన వారి పేర్లు సీక్రెట్ గా ఉంచుతామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డ్రగ్స్ ను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుందన్నారు. డ్రగ్స్ ను సప్లై చేసే వారిని పట్టుకునే పనిలో కొంతమంది పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెట్టారన్నారు. సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరుదులలో ఎవరైనా ఇటువంటి నిషేధిత డ్రగ్స్ సప్లై చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story