ట్రాన్స్​ఫార్మర్​లోని రాగి తీగలు, ఆయిల్ చోరీ

by Sridhar Babu |
ట్రాన్స్​ఫార్మర్​లోని రాగి తీగలు, ఆయిల్ చోరీ
X

దిశ,నిజాంసాగర్ : విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్ నుండి రాగి తీగలు, ఆయిల్ ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించిన ఘటన నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి గ్రామ శివారులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఏఎస్ఐ రాజేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం నర్సింగ్ రావు పల్లి గ్రామానికి చెందిన మస్కూరి గణేష్ అనే రైతు పంట పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లోని రాగి తీగలు, ఆయిల్ ను గుర్తు తెలియని దుండగులు దొంగిలించినట్టు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed