హజ్ యాత్రికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది

by Sridhar Babu |
హజ్ యాత్రికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : హజ్ యాత్రికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, మక్కాలో కూడా ఇక్కడి నుండి వెళ్లిన వారికి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని రాష్ర్ట ప్రభుత్వ సలహదారు షబ్బిర్ అలీ అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ హజ్ సొసైటీ మౌలానా సయ్యద్ అబిద్ ఖాస్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండవ హాజ్ ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా ముహమ్మద్ షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ ఏడాది హజ్‌కు ఉద్దేశించిన హజ్ యాత్రికుల

మొదటి హజ్ శిక్షణ శిబిరం ఆదివారం బోధన్ రోడ్డులోని ఎన్ ఎన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ శిక్షణా శిబిరాన్ని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ప్రారంభించారు. మత పండితులు ముఖ్యమైన లాజిస్టిక్ ఏర్పాట్లు, హజ్ యాత్ర సన్నాహాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హజ్ యాత్రికులు హజ్ శిక్షణా శిబిరాల్లో పాల్గొని వారి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రో పాషా, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ పాల్గొన్నారు.

Advertisement

Next Story