బాల్కొండలో చైన్ స్నాచింగ్.. కన్నుమూసి తెరిచేలోగా తులం గోల్డ్ చోరీ

by Anjali |
బాల్కొండలో చైన్ స్నాచింగ్..  కన్నుమూసి తెరిచేలోగా తులం గోల్డ్ చోరీ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో చైన్ స్నాచర్స్ మళ్లీ విజృంభించారు. మొన్నటికి మొన్న ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ మెడలో నుంచి చైన్ లాక్కెళ్లిన ఘటన మరువక ముందే బాల్కొండలో మంగళవారం చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ ఉదయాన్నే తన పిల్లలను స్కూల్లో దింపేందుకు ఇంటి నుండి బయటకు వెళ్లింది. స్కూళ్లో పిల్లలను దిగబెట్టి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో వెనక నుండి బైక్ పై వచ్చిన ఇద్దరు స్నాచర్లు ఆమె మెడలోని తులంనర బంగారు గొలుసును కన్ను మూసి తెరిచేలోగా లాక్కెళ్లిపోయారు. ఈ హఠాత్పరిణామానికి షాక్ కు గురైన మహిళ తేరుకుని అరిచేలోగానే స్నాచర్లు అక్కడి నుండి మెరుపు వేగంతో మాయమయ్యారు. ఈ ఘటనపై బాధితురాలు బాల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed