బాల్కొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల గెలుపు

by Sridhar Babu |
బాల్కొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల గెలుపు
X

దిశ, ఆర్మూర్ : బాల్కొండ నియోజకవర్గంలో ఆదివారం ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రతి రౌండ్లో ఈ రెండు పార్టీల అభ్యర్థుల మెజార్టీ దోబూచులాడింది. 18 రౌండ్లలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని విజయం వరించింది. ప్రశాంత్ రెడ్డికి 70,417 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ 65,884 ఓట్లతో తీవ్ర పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ 30250 ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. బాల్కొండ నియోజకవర్గంలో వేముల ప్రశాంత్ రెడ్డి గత పది సంవత్సరాల కాలంలో చేసిన వేల కోట్ల అభివృద్ధి పనులే ఆయనను గెలిపించినట్లు తెలుస్తుంది.

Next Story

Most Viewed