బ్రిడ్జి కూలి డీసీఎం వ్యాన్ బోల్తా

by Sridhar Babu |
బ్రిడ్జి కూలి డీసీఎం వ్యాన్ బోల్తా
X

దిశ, గాంధారి : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లొంక తండా సమీపంలో గల వంతెన ఆదివారం కూలిపోయింది. ధాన్యం లోడుతో వస్తున్న డీసీఎం వ్యాన్ వంతెన పైనుండి వస్తుండగా బ్రిడ్జి కూలడంతో కాలువలోకి పడింది. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో తండావాసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా బ్రిడ్జి పరిస్థితి గురించి బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కు లొంకతండా సర్పంచ్ ప్రేమ్ వినతి పత్రం ఇవ్వగా కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం హామీ ఇచ్చారని, కొందరు నాయకుల వల్ల నిర్మాణం చేపట్టకుండా అడ్డుకున్నారని సర్పంచ్ ప్రేమ్ ఆరోపించారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Next Story