- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
బ్రిడ్జి కూలి డీసీఎం వ్యాన్ బోల్తా
by Sridhar Babu |
X
దిశ, గాంధారి : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లొంక తండా సమీపంలో గల వంతెన ఆదివారం కూలిపోయింది. ధాన్యం లోడుతో వస్తున్న డీసీఎం వ్యాన్ వంతెన పైనుండి వస్తుండగా బ్రిడ్జి కూలడంతో కాలువలోకి పడింది. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో తండావాసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా బ్రిడ్జి పరిస్థితి గురించి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కు లొంకతండా సర్పంచ్ ప్రేమ్ వినతి పత్రం ఇవ్వగా కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం హామీ ఇచ్చారని, కొందరు నాయకుల వల్ల నిర్మాణం చేపట్టకుండా అడ్డుకున్నారని సర్పంచ్ ప్రేమ్ ఆరోపించారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Advertisement
Next Story