- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
బీఆర్ఎస్కు భారీ షాక్
దిశ, నవీపేట్ : నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. ఎడపల్లి జెడ్పీటీసీ , జిల్లా వైస్ చైర్ పర్సన్ రజిత యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇచ్చి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో కాంగ్రెస్కు చెందిన రజిత - ఎల్లయ్య యాదవ్ల దంపతులు బీఆర్ఎస్లో చేరి ఎడపల్లి జెడ్పీటీసీ గెలిచి మాజీ ఎమ్మెల్యే షకీల్ అండతో జెడ్పీ చైర్ పర్సన్ పదవి దక్కించుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు అధికార కాంగ్రెస్లో చేరుతున్నారు.
ఇదే బాటలో మరికొందరు...
బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు చెందిన మరికొందరు ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచ్ లు, నాయకులు అధికార కాంగ్రెస్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని, కానీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆచితూచి వ్యవహరిస్తూన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రజిత యాదవ్ బాటలో ఎడపల్లి కి చెందిన మరికొందరు ప్రజాప్రతినిధులు నడుస్తారని, ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తో చర్చలు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.