ఆటో బోల్తా... ఇద్దరు మృతి

by Sridhar Babu |
ఆటో బోల్తా... ఇద్దరు మృతి
X

దిశ, లింగంపేట్ : వివాహ వేడుకలకు హాజరై తిరిగి వెళ్తుండగా అదుపుతప్పి ఆటో బోల్తాపడడంతో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కోర్పోలు గ్రామంలో జరిగిన వివాహానికి మహమ్మద్ నగర్ మండలం గుణుకుల్ గ్రామానికి చెందిన బంధువులు ఆటోలో హాజరయ్యారు. వివాహం ముగించుకొని తిరిగి వెళ్తుండగా మండలంలోని భాయింపల్లి గ్రామ శివారులో ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఆటో బోల్తాపడడంతో ఆటోలో ప్రయాణిస్తున్న గౌడ గారి సంగయ్య (66) అనే వ్యక్తి సంఘటన

స్థలంలోని మృతి చెందినట్లు తెలిపారు. అలాగే గుంపులు గ్రామానికి చెందిన లాలవ తీవ్ర గాయాలు కావడంతో ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మృతి చెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న బాలమణి, సతీష్, సాయవ్వ, పోషవ్వ, కవితతో పాటు మరో ఐదుగురికి గాయాలైనట్లు తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను 108 అంబులెన్స్ వాహనంలో తరలించారు. క్షత గాత్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story