- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
స్విమ్మింగ్ ఫీజు తగ్గించండన్నందుకు యువకులపై దాడి
దిశ, నిజామాబాద్ సిటీ : స్విమ్మింగ్ ఫీజు తగ్గించండన్నందుకు యువకులపై ఓ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు దాడి చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ కు ఆదివారం నిజామాబాద్ రూరల్ మండలానికి చెందిన తిరుమనపల్లి గ్రామానికి చెందిన రాజేష్, నవీన్, రంజిత్, లింబాద్రి అనే నలుగురు యువకులు మదనపల్లిలోని సుభాష్ గార్డెన్ కు స్విమ్మింగ్ కోసం వెళ్లారు. అక్కడ ధరలను చూసి నివ్వెరపోయారు.
దీంతో యాజమాన్యం దగ్గరికి వెళ్లి గత సంవత్సరం తక్కువ ఉన్న ధరలు ఈసారి అమాంతం పెంచేశారని, ధర తగ్గించాలని కోరారు. దాంతో ఆ స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం వారి మాటను లెక్క చేయకపోగా ఆ నలుగురు యువకులను క్రూరంగా ఓ గదిలో బంధించి అక్కడే ఉన్న తమ ప్రైవేట్ బౌన్సర్లతో ఇష్టారీతిన దాడికి దిగారు. దీంతో తీవ్ర గాయాలైన ఆ యువకులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు.