బెల్ట్ షాప్ పై దాడి...భారీగా మద్యం పట్టివేత...

by Sridhar Babu |
బెల్ట్ షాప్ పై దాడి...భారీగా మద్యం పట్టివేత...
X

దిశ,నిజాంసాగర్ : మహమ్మద్ నగర్ మండలంలోని తుంకిపల్లి గ్రామానికి చెందిన సాయిబాబా అనే వ్యక్తి నడుపుతున్న బెల్ట్ షాప్ పై పోలీసులు దాడి చేసి 33 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నట్లు స్థానిక ఎస్సై సుధాకర్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మహమ్మద్ నగర్ మండలంలోని తుంకిపల్లి గ్రామంలో రౌతు సాయిబాబా అనే వ్యక్తి అక్రమంగా ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అధిక ధరలకు మద్యం అమ్ముతున్నాడన్న సమాచారం మేరకు పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీ చేయగా సుమారు 33 లీటర్ల మద్యం లభించిందన్నారు. ఈ మేరకు సాయిబాబా పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Advertisement

Next Story