రెస్టారెంట్లు లో తింటున్నారా.. అయితే మీ పని గోవిందా..!

by Kalyani |
రెస్టారెంట్లు లో తింటున్నారా.. అయితే మీ పని గోవిందా..!
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. గురువారం నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ ప్రాంతంలో గల ఎమ్మెస్సార్ బార్ అండ్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తారా సింగ్ నాయక్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన చికెన్, కొన్ని రోజుల క్రితం వండిపెట్టిన చికెన్ లెగ్ పీస్ లు, ప్రాణాంతకమైన టెస్టింగ్ సాల్ట్ కలర్స్, ఇతర ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఐదు రోజుల క్రితం వడ్డీ ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన గ్రేవ్ ను , ఆహార పదార్థాలను చెత్తబుట్టలో వేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారి టి .నాయక్ హెచ్చరించారు. రెస్టారెంట్లు, హోటల్లు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు పరిశుభ్రత పాటించాలని, నిలువ ఉంచిన ఆహార పదార్థాలు వాడితే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story