- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
అయ్యప్ప ఆలయంలో చోరీ చేసిన నిందితుడు అరెస్ట్
by Kalyani |
X
దిశ, ఎల్లారెడ్డి : నెలరోజుల క్రితం ఎల్లారెడ్డి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో తాళం పగలగొట్టి గుడిలో దొంగతన ప్రయత్నం చేసిన దొంగని గురువారం ఎల్లారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి తాళం పగల కొట్టడానికి ఉపయోగించినటువంటి రాడును స్వాధీనం పరుచుకొని దొంగని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నిందితుడు లింగంపేట మండలం చెందిన ఎక్కపల్లి గ్రామ నివాసి అయిన మాలోత్ గణేష్ గా గుర్తించడం జరిగింది. ఇతను గతంలో లింగంపేట,తాడ్వాయి, నాగిరెడ్డిపేట్, దేవనపల్లి వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలు చేసి గతంలో జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎస్ఐ తెలిపారు. నిందితుడిని అయ్యప్ప గుడిలో అమర్చిన సీసీ కెమెరాల్లో చిక్కిన చిత్రం ఆధారంగా నిందితున్ని పట్టుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Next Story