ట్రైనీ ఐపీఎస్ వాహనం ఢీకొని వ్యక్తి తలకు గాయాలు

by srinivas |   ( Updated:2024-05-18 05:45:18.0  )
ట్రైనీ ఐపీఎస్ వాహనం ఢీకొని వ్యక్తి తలకు గాయాలు
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక వినాయక నగర్ ప్రాంతానికి చెందిన అశోక్ పని నిమిత్తం బయటకు బయల్దేరారు. అయితే ఆయన్ను ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో ట్రైనీ ఐపీఎస్‌ చైతన్య రెడ్డికి చెందిన ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. దీంతో అశోక్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చైతన్య రెడ్డినే హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం బాధితుడికి చికిత్స కొనసాగుతోంది.


Advertisement

Next Story

Most Viewed