- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
అక్క దగ్గరికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు
దిశ, భీంగల్: తన తోబుట్టువు దగ్గరకని వెళ్లి వస్తుండగా తన స్వగ్రామం జగిర్యాల శివారులో బైక్ పై నుంచి పడి లింబాద్రి (55)అనంత లోకాలకు వెళ్ళాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భీంగల్ మండలం జాగిర్యాల గ్రామానికి చెందిన ఆవుసుల లింబాద్రి శనివారం తన అక్క దగ్గరికి వెళ్ళివస్తానని మధ్యాహ్నం పెర్కిట్కు బైక్ పై వెళ్ళాడు. అక్కడే తిని రాత్రి 10 గంటల వరకు ఉండి తిరుగు ప్రయాణమయ్యాడు. వస్తుండగా రాత్రి 11 గంటల ప్రాంతంలో సుదర్శన్ నగర్ తండా, జాగిర్యాల గ్రామాల మధ్య గల ప్రమాదకర మలుపు వద్ద బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. దీంతో రోడ్డు పక్కనే ఉన్న పుట్ట పై పడ్డ లింబాద్రి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇది గమనించిన వాహనదారులు.. పోలీస్లకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి వచ్చిన ఎస్సై హరిబాబు బైక్ నెంబర్ సహాయంతో మృతుడు జాగిర్యలకు చెందిన వ్యక్తిగా గుర్తించి మాజీ సర్పంచ్ శ్రీనివాస్కు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి వచ్చి చూడగా మృతుడు తన సొంత అన్న లింబాద్రి అని గుర్తించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం శవాన్ని ఆర్మూర్ గవర్నమెంట్ హాస్పిటలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు .మృతునికి భార్య,ఇద్దరు కూతుర్లు, కొడుకు ఉన్నారు.